టిఆర్ఎ సరికొత్త నిబంధన
- February 08, 2016
సిమ్కార్డ్స్ అమ్మకాలపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనను అమల్లోకి తీసుకురానుంది. ఇక నుంచి ఏ వ్యక్తి అయినా ఓ సంస్థ నుంచి 10 సిమ్కార్డ్స్ కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. మూడు టెలికామ్ ఆపరేటర్లు ఉన్నందున, ఓ వ్యక్తికి మేగ్జిమమ్ అంటే 30 సిమ్కార్డ్స్ మాత్రమే పొందడానికి వీలుంటుంది. సిమ్కార్డ్స్ను షాపుల్లో అమ్మడాన్ని నిషేధించింది. మొబైల్ ఆపరేటర్కి సంబంధించిన ఔట్లెట్స్లో మాత్రమే సిమ్కార్డ్స్ను విక్రయించాలి. సిమ్కార్డుల్ని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని టిఆర్ఎ హెచ్చరించింది. ఒకరి కోసం ఇంకొకరి పేరుతో సిమ్కార్డులు తీసుకోవడం, అలా తీసుకున్న సిమ్కార్డులతో నేరాలకు పాల్పడితే ఎవరి పేరుతో ఉందో వారే ముందుగా లీగల్ చర్చలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకునేవారు తమ పేరుతో ఉన్న అన్ని సిమ్కార్డ్స్నూ క్యాన్సిల్ చేసుకోవాలి. కొత్త నిబంధనల గురించి అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టనుంది టిఆర్ఎ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







