టిఆర్‌ఎ సరికొత్త నిబంధన

- February 08, 2016 , by Maagulf
టిఆర్‌ఎ సరికొత్త నిబంధన

సిమ్‌కార్డ్స్‌ అమ్మకాలపై టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ) కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనను అమల్లోకి తీసుకురానుంది. ఇక నుంచి ఏ వ్యక్తి అయినా ఓ సంస్థ నుంచి 10 సిమ్‌కార్డ్స్‌ కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. మూడు టెలికామ్‌ ఆపరేటర్లు ఉన్నందున, ఓ వ్యక్తికి మేగ్జిమమ్‌ అంటే 30 సిమ్‌కార్డ్స్‌ మాత్రమే పొందడానికి వీలుంటుంది. సిమ్‌కార్డ్స్‌ను షాపుల్లో అమ్మడాన్ని నిషేధించింది. మొబైల్‌ ఆపరేటర్‌కి సంబంధించిన ఔట్‌లెట్స్‌లో మాత్రమే సిమ్‌కార్డ్స్‌ను విక్రయించాలి. సిమ్‌కార్డుల్ని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని టిఆర్‌ఎ హెచ్చరించింది. ఒకరి కోసం ఇంకొకరి పేరుతో సిమ్‌కార్డులు తీసుకోవడం, అలా తీసుకున్న సిమ్‌కార్డులతో నేరాలకు పాల్పడితే ఎవరి పేరుతో ఉందో వారే ముందుగా లీగల్‌ చర్చలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకునేవారు తమ పేరుతో ఉన్న అన్ని సిమ్‌కార్డ్స్‌నూ క్యాన్సిల్‌ చేసుకోవాలి. కొత్త నిబంధనల గురించి అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టనుంది టిఆర్‌ఎ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com