కోవిడ్19:పాక్షిక కర్ఫ్యూ మళ్లీ విధిస్తున్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన కువైట్
- September 04, 2020
కువైట్ సిటీ:కువైట్ లో మళ్లీ పాక్షికంగా కర్ఫ్యూని విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. గురువారం ఒక్క రోజే కువైట్ లో 900 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ పాక్షికంగా కర్ఫ్యూ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వదంతలు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కర్ఫ్యూ విధింపు స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఎలాంటి కర్ఫ్యూ విధించే యోచన లేదని తెలిపింది. కరోనా కేసులు గతంలో కన్నా ఎక్కువగా నమోదవుతున్నా..షాపులు, మార్కెట్లు సివేయబోమని తేల్చి చెప్పింది. అయితే..కరోనా తీవ్రత పెరగటానికి ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించకపోవటమేనని ఆరోగ్యశాఖ వెల్లడించింది. భౌతిక దూరం పాటించకుండా ఇళ్లలో, ఆఫీసులలో గుమిగూడటమే వైరస్ వ్యాప్తికి కారణం అవుతోందని..అలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







