అబుధాబి వెళ్లాలనుకునే వారికి ఊరట..కోవిడ్ 19 టెస్ట్ నిబంధనలు సులభతరం
- September 05, 2020
అబుధాబి:ఇతర ప్రాంతాల నుంచి రాజధాని అబుధాబికి వెళ్లాలనుకునే వారికి నింబధనలను మరింత సులభతరం చేశారు అధికారులు. కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల విషయంలో నిబంధనలను కొద్దిమేర సడలించారు. ఇక నుంచి అబుధాబి వెళ్లే వారు ఖచ్చితంగా పీసీఆర్ టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదు. పీసీఆర్ టెస్టుగానీ, డీపీఐ టెస్ట్ లలో ఏదో ఒక రిపోర్ట్ ను అధికారులకు చూపిస్తే చాలు. అయితే అబుధాబి చేరుకునే 48 గంటలలోపు చేయించుకున్న నిర్ధారణ పరీక్షల రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. శనివారం(సెప్టెంబర్ 5) నుంచి ఈ సడలింపు నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇదిలాఉంటే అబుధాబిలో వరుసగా ఆరు రోజులు అంతకు మించి ఉంటే మాత్రం ఆరో రోజున ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..









