అబుధాబి వెళ్లాలనుకునే వారికి ఊరట..కోవిడ్ 19 టెస్ట్ నిబంధనలు సులభతరం

- September 05, 2020 , by Maagulf
అబుధాబి వెళ్లాలనుకునే వారికి ఊరట..కోవిడ్ 19 టెస్ట్ నిబంధనలు సులభతరం

అబుధాబి:ఇతర ప్రాంతాల నుంచి రాజధాని అబుధాబికి వెళ్లాలనుకునే వారికి నింబధనలను మరింత సులభతరం చేశారు అధికారులు. కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల విషయంలో నిబంధనలను కొద్దిమేర సడలించారు. ఇక నుంచి అబుధాబి వెళ్లే వారు ఖచ్చితంగా పీసీఆర్ టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదు. పీసీఆర్ టెస్టుగానీ, డీపీఐ టెస్ట్ లలో ఏదో ఒక రిపోర్ట్ ను అధికారులకు చూపిస్తే చాలు. అయితే అబుధాబి చేరుకునే 48 గంటలలోపు చేయించుకున్న నిర్ధారణ పరీక్షల రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. శనివారం(సెప్టెంబర్ 5) నుంచి ఈ సడలింపు నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇదిలాఉంటే అబుధాబిలో వరుసగా ఆరు రోజులు అంతకు మించి ఉంటే మాత్రం ఆరో రోజున ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com