అబుధాబి వెళ్లాలనుకునే వారికి ఊరట..కోవిడ్ 19 టెస్ట్ నిబంధనలు సులభతరం
- September 05, 2020
అబుధాబి:ఇతర ప్రాంతాల నుంచి రాజధాని అబుధాబికి వెళ్లాలనుకునే వారికి నింబధనలను మరింత సులభతరం చేశారు అధికారులు. కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల విషయంలో నిబంధనలను కొద్దిమేర సడలించారు. ఇక నుంచి అబుధాబి వెళ్లే వారు ఖచ్చితంగా పీసీఆర్ టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదు. పీసీఆర్ టెస్టుగానీ, డీపీఐ టెస్ట్ లలో ఏదో ఒక రిపోర్ట్ ను అధికారులకు చూపిస్తే చాలు. అయితే అబుధాబి చేరుకునే 48 గంటలలోపు చేయించుకున్న నిర్ధారణ పరీక్షల రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. శనివారం(సెప్టెంబర్ 5) నుంచి ఈ సడలింపు నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇదిలాఉంటే అబుధాబిలో వరుసగా ఆరు రోజులు అంతకు మించి ఉంటే మాత్రం ఆరో రోజున ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







