కోవిడ్ 19తో సౌదీ లో 4 వేలు దాటిన మరణాలు
- September 05, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. వైరస్ బారిన పడి మరో 33 మంది ప్రాణాలు కొల్పోయారు. దీంతో కింగ్డమ్ పరిధిలో కరోనా మృతుల సంఖ్య 4,015కి చేరింది. మరోవైపు సౌదీ వ్యాప్తంగా కొత్తగా 822 మందికి వైరస్ సోకింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు జెడ్డాలో 48, మక్కాలో 48, దమ్మమ్ 45, రియాద్ 41, మదీనాలో 40 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన వారి సంఖ్యతో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. లేటెస్ట్ గా మరో 1,099 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,95,063 మందికి చేరింది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







