కువైట్ లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా న్యాయమూర్తుల బృందం
- September 05, 2020
కువైట్ సిటీ:మహిళా సాధికారికత దిశగా అడుగులు వేస్తున్న కువైట్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యాయవ్యవస్థలోనూ మహిళలకు ప్రాధాన్యమిస్తూ కువైట్ చరిత్రలోనే తొలిసారిగా 8 మందిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించింది. ఆ ఎనిమిది మంది జడ్జీలు పదవీ బాధ్యతలను స్వీకరించారు. మొత్తం 54 మందిని సుప్రీం కోర్టు జడ్జీలుగా ఇటీవలె ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే మహిళా న్యాయమూర్తుల పనితీరుపై కొంతకాలం తర్వాత అంచనాకు వస్తామని కువైట్ సుప్రీం న్యాయమండలి చైర్మన్ యూసుఫ్ అల్ మతావా తెలిపారు. అయితే..ఆ అంచనా కాలం ఎంతకాలమనేది మాత్రం ఛైర్మన్ వెల్లడించలేదు. కాగా..గల్ఫ్ దేశాల్లోనే మహిళా సాధికారికతకు అధిక ప్రాధాన్యత కల్పించటంలో కువైట్ ముందువరుసలో ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కుటుంబ సాంప్రదాయాల మాటున మహిళలపై కఠిన ఆంక్షలు ఉన్నా..వాటిని అధిగమించి ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తూ మహిళాభివృద్ధికి ప్రొత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. ఇక సుప్రీంకోర్టు జడ్జీలుగా మహిళలకు స్థానం కల్పించటం పట్ల కువైట్ మహిళా సంస్కృతి అధ్యక్షురాలు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో మహిళలకు ప్రధాన్యం కల్పించాలంటూ తాము ఎన్నాళ్లుగానో పొరాడుతున్నామని..ఇన్నాళ్లు తర్వాత తమ పోరాటం సత్ఫలితానని ఇచ్చిందని చెప్పారు.
తాజా వార్తలు
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో పోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...









