కువైట్ లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా న్యాయమూర్తుల బృందం
- September 05, 2020
కువైట్ సిటీ:మహిళా సాధికారికత దిశగా అడుగులు వేస్తున్న కువైట్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యాయవ్యవస్థలోనూ మహిళలకు ప్రాధాన్యమిస్తూ కువైట్ చరిత్రలోనే తొలిసారిగా 8 మందిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించింది. ఆ ఎనిమిది మంది జడ్జీలు పదవీ బాధ్యతలను స్వీకరించారు. మొత్తం 54 మందిని సుప్రీం కోర్టు జడ్జీలుగా ఇటీవలె ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే మహిళా న్యాయమూర్తుల పనితీరుపై కొంతకాలం తర్వాత అంచనాకు వస్తామని కువైట్ సుప్రీం న్యాయమండలి చైర్మన్ యూసుఫ్ అల్ మతావా తెలిపారు. అయితే..ఆ అంచనా కాలం ఎంతకాలమనేది మాత్రం ఛైర్మన్ వెల్లడించలేదు. కాగా..గల్ఫ్ దేశాల్లోనే మహిళా సాధికారికతకు అధిక ప్రాధాన్యత కల్పించటంలో కువైట్ ముందువరుసలో ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కుటుంబ సాంప్రదాయాల మాటున మహిళలపై కఠిన ఆంక్షలు ఉన్నా..వాటిని అధిగమించి ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తూ మహిళాభివృద్ధికి ప్రొత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. ఇక సుప్రీంకోర్టు జడ్జీలుగా మహిళలకు స్థానం కల్పించటం పట్ల కువైట్ మహిళా సంస్కృతి అధ్యక్షురాలు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో మహిళలకు ప్రధాన్యం కల్పించాలంటూ తాము ఎన్నాళ్లుగానో పొరాడుతున్నామని..ఇన్నాళ్లు తర్వాత తమ పోరాటం సత్ఫలితానని ఇచ్చిందని చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







