తెలంగాణలో కొత్తగా 2,511 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- September 05, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 2,511 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 305 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక్కరోజులోనే 11 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 38 వేల 395కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 877కు పెరిగిందని వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ఇప్పటివరకు కరోనాతో చికిత్స తీసుకుని లక్షా 4 వేల 603 మంది డిశ్చార్ కాగా... 32 వేల 915 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









