విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించటానికి సిద్ధమవుతున్న ఒమన్
- September 08, 2020
మస్కట్:విమానయానికి సంబంధించి ఒమన్ సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఒమన్ లోని విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించింది. అనంతరం విమానాశ్రయాలను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే..ఇతర దేశాల్లో కోవిడ్ తీవ్రతను బట్టి ఆయా దేశాలకు సర్వీసులను కొనసాగించాలా..లేదా..అనేది ఎప్పటిప్పుడు సమీక్షించుకుంటామని తెలిపింది. అదే సమయంలో వివిధ దేశాలతో పరస్పరం ఉన్న ఒప్పందం మేరకు అనుమతి ఉన్న దేశాలకు మాత్రమే సర్వీసులను నడపనుంది. ఇదిలాఉంటే 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ ఇచ్చిన నివేదికపై కూడా కమిటీ సమీక్షించింది. కరోనా నేపథ్యంలో విద్యార్ధుల భద్రతకు ప్రధాన్యం ఇస్తూనే..నాణ్యమైన విద్య అందించే అవకాశాలు, విధానాలపై చర్చించింది. విద్యార్ధుల ఆసక్తి, కరోనా తీవ్రతను పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా పరిస్థితిని అంచనా వేసి విద్యా విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కమిటీ వివరించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









