ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- March 28, 2026
అబుదాబి: మిడిలీస్టులోని సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చర్చించారు.అలాగే, అంతర్జాతీయ నౌకాయానం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి సమీక్షించారు.
అంతకు ముందు యూఏఈలో అధికారిక పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి యూఏఈ అధ్యక్షుడు స్వాగతం పలికారు.అబుదాబిలో ఇరువురు దేశాధినేతలు సమావేశమయ్యారు.ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
యూఏఈ మరియు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కొనసాగిస్తున్న దాడులను జెలెన్స్కీ ఖండించారు. పౌరులు మరియు పౌర మౌలిక సదుపాయాల పై దాడులతో సహా పలు అంశాలపై చర్చించారు.ఇరాన్ చేస్తున్న దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమే కాకుండా, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి, భద్రతను దెబ్బతీస్తుందని తెలిపారు.
హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సంక్షోభాలను యూఏఈ వివేకంతో మరియు సంయమనంతో ఎదుర్కొంటోందని ధృవీకరించారు. పౌరులు మరియు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఉగ్రవాద దాడుల నేపథ్యంలో యూఏఈ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూనే ఉంటుందని ఆయన స్పష్టం చెప్పారు. అన్ని రకాల ముప్పులను ఎదుర్కోవడానికి యూఏఈ పూర్తిగా సిద్ధంగా ఉందని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఆత్మరక్షణకు తనకు పూర్తి హక్కు ఉందని ఆయన ధృవీకరించారు.
యూఏఈ మరియు ఉక్రెయిన్ మధ్య ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలపై కూడా ఇరుపక్షాలు చర్చించాయి. అంతేకాకుండా, ఉక్రెయిన్లో శాశ్వత శాంతిని సాధించే లక్ష్యంతో చేపట్టిన అన్ని ప్రయత్నాలకు, కార్యక్రమాలకు యూఏఈ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సమావేశానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధానమంత్రి, అధ్యక్ష దర్బారు ఛైర్మన్ అయిన హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్; ప్రత్యేక వ్యవహారాల అధ్యక్ష దర్బారు డిప్యూటీ ఛైర్మన్ అయిన హెచ్.హెచ్. షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్; యూఏఈ అధ్యక్షుడి సలహాదారు అయిన షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్; తో పాటు పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
అంతకుముందు, జెలెన్స్కీ యూఏఈకి చేరుకున్నారు, అక్కడ విమానాశ్రయంలో ఇంధన మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి సుహైల్ బిన్ మొహమ్మద్ అల్ మజ్రూయీ పలువురు అధికారులతో కలిసి ఆయనకు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









