ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- March 28, 2026
రియాద్: శత్రు క్షిపణులు, డ్రోన్లను అడ్డగించడం లేదా అవి తాకిన ప్రదేశాలకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నైనా ఫోటోలు తీయడం, ప్రచురించడం లేదా పంచుకోవడం చేయరాదని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
రాజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను అడ్డగించడం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను జారీ చేసింది. అంతకుముందు, అనుమానాస్పద గగనతల వస్తువుల గురించి వినియోగదారులు నివేదించడానికి వీలుగా రక్షణ మంత్రిత్వ శాఖ "తవక్కల్నా" అనే జాతీయ అప్లికేషన్ ద్వారా ఒక సేవను ప్రారంభించింది.
ఈ సేవ దేశాన్ని రక్షించడానికి మరియు దాని సామర్థ్యాలను కాపాడటానికి జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతుగా, వేగవంతమైన సమాచార షేరింగ్ మరియు ప్రతిస్పందనను నిర్ధారించడానికి, డ్రోన్లు లేదా క్షిపణులను చూసినట్లయితే పౌరులు మరియు నివాసితులు నివేదించడానికి వీలు కల్పిస్తుంది.
నివేదికలు రియల్ టైమ్ లో అందేలా చూడటం ద్వారా ప్రతిస్పందన వేగాన్ని పెంచడమే ఈ చొరవ లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మల్కీ మాట్లాడుతూ.. ఈ సేవ ప్రజలకు, రక్షణ వ్యవస్థకు మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుందని, జాతీయ భద్రతకు మద్దతు ఇవ్వడంలో పౌరులు, నివాసితుల పాత్రను చెబుతుందని అన్నారు.
వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి సౌదీ సాయుధ దళాలకు అధునాతన సామర్థ్యాలు ఉన్నాయని, సంబంధిత ప్రమాదాలను గుర్తించడంలో ప్రజలను భాగస్వాములను చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఈ సేవ ఒక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









