బురైమి కోసం ఎక్స్పాట్ టూరిస్ట్ వీసా ప్లాన్
- February 10, 2016
బురైమి నుంచి ఒమన్లోని వివిధ ప్రాంతాలకు వచ్చి వెళ్ళేవారి కోసం 'ఎక్స్పాట్ టూరిస్ట్ వీసా'లో కొత్త మార్పులు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, బురామీ బ్రాంచ్ ఈ దిశగా పలు ఆలోచనల్ని చేస్తోంది. ఒమన్ బోర్డర్లో ఉన్న బురామీ నుంచి నిత్యం ఒమన్లోని పలు ప్రాంతాలకు వలసదారులు పలు రకాలైన పనుల నిమిత్తం వస్తుంటారు. అయితే ప్రతిరోజూ ఒమన్ నుంచి టూరిస్ట్ వీసా తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి వచ్చి, వెళ్ళడాని కోసం ఉపయోగపడే ఈ వీసా కోసం 5 ఒమన్ రియాల్స్ని ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది. దీన్ని వారం రోజులకు వీలుగా పొడిగిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా ఒమన్ నుంచి బురామీకి వచ్చి, వెళితే వీసా పూర్తిగా రద్దయిపోతుందనే నిబంధన ఇప్పటిదాకా ఉంది. దాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







