ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం : 60 మందికి గాయలు

- February 10, 2016 , by Maagulf
ఈజిప్టులో  ఘోర రైలు ప్రమాదం : 60 మందికి గాయలు

ఈజిప్టులో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 60 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. రైలు అస్వాన్ నుంచి రాజధాని కైరో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బెని సూఫ్ నగరంలో వెళ్తున్న రైలు టర్న్ అవుతుండగా రెండు బోగీలు పట్టుతప్పి రైలు నుంచి విడిపోయి పట్టాల పక్కన పడిపోయాయని సమాచారం.ఈ ప్రమాదంలో రెండు బోగీల్లో ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారని భద్రతాధికారులు, మెడికల్ ఉన్నతాధికారులు వివరించారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి 40కి పైగా అంబులెన్స్ లు పంపించి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com