SRH పై RCB విజయం
- September 22, 2020దుబాయ్:దుబాయ్ ఇనేర్నాషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి సన్రైజర్స్ ముందు 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ జట్టు 19.4 ఓవర్లకే అన్ని వికెట్లను కోల్పోయి పరాజయం పాలైంది.
సన్రైజర్స్ జట్టు మొదట గట్టిపోటీనే ఇచ్చినప్పటికి.. పరుగుల వరద పారిస్తున్న బెయిర్స్టో(43 బంతుల్లో 61 పరుగులు)ను చాహల్ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. ఇక బెయిర్స్టో తర్వాత బ్యాటింగ్కు దిగిన విజయ్ శంకర్ను కూడా ఒక బంతికే చాహల్ పెవిలియన్కు పంపాడు. ఇక అక్కడి నుంచి బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. సన్రైజర్స్ జట్టు 121 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోగా.. 153 పరుగులకు ఆల్ ఔట్ అయిపోయింది. చాహల్ ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లను తీసి సత్తా చాటాడు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..