SRH పై RCB విజయం
- September 22, 2020
దుబాయ్:దుబాయ్ ఇనేర్నాషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి సన్రైజర్స్ ముందు 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ జట్టు 19.4 ఓవర్లకే అన్ని వికెట్లను కోల్పోయి పరాజయం పాలైంది.
సన్రైజర్స్ జట్టు మొదట గట్టిపోటీనే ఇచ్చినప్పటికి.. పరుగుల వరద పారిస్తున్న బెయిర్స్టో(43 బంతుల్లో 61 పరుగులు)ను చాహల్ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. ఇక బెయిర్స్టో తర్వాత బ్యాటింగ్కు దిగిన విజయ్ శంకర్ను కూడా ఒక బంతికే చాహల్ పెవిలియన్కు పంపాడు. ఇక అక్కడి నుంచి బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. సన్రైజర్స్ జట్టు 121 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోగా.. 153 పరుగులకు ఆల్ ఔట్ అయిపోయింది. చాహల్ ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లను తీసి సత్తా చాటాడు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









