ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- April 04, 2026
దోహా: గల్ఫ్ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఖతార్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇటలీ రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఆమె అక్కడి నుండి దోహాకు చేరుకుంటారు. ఖతార్ పర్యటన అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి బయలుదేరి వెళతారు.
మిడిలీస్టులో అమెరికా,ఇజ్రాయెట్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 లేదా G20 కూటమికి చెందిన ఒక దేశాధినేత గల్ఫ్ ప్రాంతంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ఇటలీ మరియు ఖతార్ దేశాల మధ్య రాజకీయ-దౌత్య, సైనిక-రక్షణ, ఇంధన, వాణిజ్య, ప్రత్యక్ష పెట్టుబడులు, టెక్నాలజీ, విద్య, సంస్కృతి మరియు క్రీడలతో సహా అన్ని రంగాలలో బలమైన స్నేహాన్ని మరియు బలమైన బంధాలను మరింత పటిష్టం చేస్తుందని ఇటలీ రాయబార కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. ప్రధాన మంత్రి మెలోని తన పదవీకాలంలో ఖతార్లో పర్యటించడం ఇది రెండవ అధికారిక పర్యటన అని పేర్కొంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







