ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!

- April 04, 2026 , by Maagulf
ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!

దోహా: గల్ఫ్ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఖతార్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇటలీ రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఆమె అక్కడి నుండి  దోహాకు చేరుకుంటారు. ఖతార్ పర్యటన అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి బయలుదేరి వెళతారు.  

మిడిలీస్టులో అమెరికా,ఇజ్రాయెట్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 లేదా G20 కూటమికి చెందిన ఒక దేశాధినేత గల్ఫ్ ప్రాంతంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ఇటలీ మరియు ఖతార్ దేశాల మధ్య రాజకీయ-దౌత్య, సైనిక-రక్షణ, ఇంధన, వాణిజ్య, ప్రత్యక్ష పెట్టుబడులు, టెక్నాలజీ, విద్య, సంస్కృతి మరియు క్రీడలతో సహా అన్ని రంగాలలో బలమైన స్నేహాన్ని మరియు బలమైన బంధాలను మరింత పటిష్టం చేస్తుందని ఇటలీ రాయబార కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది.   ప్రధాన మంత్రి మెలోని తన పదవీకాలంలో ఖతార్‌లో పర్యటించడం ఇది రెండవ అధికారిక పర్యటన అని పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com