ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- April 04, 2026
దోహా: గల్ఫ్ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఖతార్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇటలీ రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఆమె అక్కడి నుండి దోహాకు చేరుకుంటారు. ఖతార్ పర్యటన అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి బయలుదేరి వెళతారు.
మిడిలీస్టులో అమెరికా,ఇజ్రాయెట్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 లేదా G20 కూటమికి చెందిన ఒక దేశాధినేత గల్ఫ్ ప్రాంతంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ఇటలీ మరియు ఖతార్ దేశాల మధ్య రాజకీయ-దౌత్య, సైనిక-రక్షణ, ఇంధన, వాణిజ్య, ప్రత్యక్ష పెట్టుబడులు, టెక్నాలజీ, విద్య, సంస్కృతి మరియు క్రీడలతో సహా అన్ని రంగాలలో బలమైన స్నేహాన్ని మరియు బలమైన బంధాలను మరింత పటిష్టం చేస్తుందని ఇటలీ రాయబార కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. ప్రధాన మంత్రి మెలోని తన పదవీకాలంలో ఖతార్లో పర్యటించడం ఇది రెండవ అధికారిక పర్యటన అని పేర్కొంది.
తాజా వార్తలు
- దోహాలో బిజినెస్ మీట్లో పాల్గొన్న ఏపీ మంత్రి పార్థసారథి
- 'ఇన్నర్ టెంపుల్' గౌరవ సభ్యుడిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు
- బహ్రెయిన్లో ప్రమాదానికి గురైన భారతీయ మహిళ స్వదేశానికి తరలింపు
- ఖతార్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు
- విమానాలలో పవర్ బ్యాంక్లపై సౌదీ అరేబియా నిషేధం..!!
- కువైట్లో ఎబోలా కేసులు లేవు..సరిహద్దుల వద్ద గట్టి భద్రత..!!
- బహ్రెయిన్ లో ప్రవాసుల కోసం వైద్య శిబిరం..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- హోర్ముజ్లో ఇరాన్కు కొత్త అధికారాన్ని తిరస్కరించిన గల్ఫ్ దేశాలు..!!
- అభివృద్ధికి మద్దతు..ఒమన్ లో కొత్త పట్టణ ప్రణాళిక చట్టం..!!









