శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- April 04, 2026
యూఏఈ: శాంతి, ఐక్యత సందేశాన్ని చాటి చెప్పేందుకు యూఏఈ వ్యాప్తంగా ఉన్న బైకర్లు ఏకమయ్యారు. గత ఆదివారం ఉదయం దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమాకు దాదాపు 300 మోటార్సైకిళ్లు బయలుదేరాయి. వరల్డ్ ఆఫ్ బైకర్స్ (WoB) నిర్వహించిన ఈ ర్యాలీలో 45కు పైగా మోటార్సైకిల్ క్లబ్ల రైడర్లతో పాటు పలువురు సోలో రైడర్లు కూడా పాల్గొన్నారు. చాలా మంది పాల్గొనేవారితో వారి కుటుంబాలు కూడా చేరగా.. కొందరు తమ భార్యలు, పిల్లలతో కలిసి ప్రయాణించారు.
"మా వద్ద 300 కంటే కొంచెం తక్కువ బైక్లు ఉన్నప్పటికీ, చాలా మంది రైడర్లు ఫ్యామిలీలతో వచ్చారు. అందువల్ల మొత్తం పాల్గొన్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది." అని WoB వ్యవస్థాపకుడు విక్టర్ కింగ్ అన్నారు.
బైక్ ర్యాలీలో పాల్గొనేవారు దుబాయ్లోని సిటీల్యాండ్ మాల్ సమీపంలో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో అటెండ్ కావాలి. భద్రతా నియమాలను పాటిస్తూ, ఈ బృందం ఉదయం 6.30 గంటలకు ఎమిరేట్స్ రోడ్ (E611) వెంబడి ఒకే లేన్లో ప్రయాణిస్తూ బయలుదేరింది. ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ఈ కాన్వాయ్ 110 కిలోమీటర్ల ప్రయాణాన్ని నాన్స్టాప్గా ఉదయం 7.45 నుండి 8 గంటల మధ్య మర్జాన్ ద్వీపాన్ని చేరుకుంది.
అయితే, మన చుట్టూ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, ఒక మంచి కారణం కోసం రైడర్లు ఏకం కావాలని తాను కోరుకున్నాను అని కింగ్ అన్నారు. అన్ని బైక్లు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు గమనిస్తారు. మా సందేశం చాలా సులభంగా వారికి సులభంగా చేరుకుతుందని వెల్లడించారు. బైకింగ్ కమ్యూనిటీలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ.. హైవే వెంబడి మోటార్సైకిళ్ల పొడవైన వరుస ఒక దృశ్యాన్ని సృష్టించింది. వివిధ జాతీయతలు మరియు నేపథ్యాలకు చెందిన రైడర్లు, ఒకే ఉమ్మడి లక్ష్యంతో ఇందులో పాల్గొన్నారు.
మార్జన్ ద్వీపంలో పాల్గొన్నవారు రైడ్ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మరియు అనుబంధాలు పెంచుకోవడానికి వీలుగా సామూహిక అల్పాహారం కోసం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ప్రారంభించబడిన మోటార్సైకిల్ బ్రాండ్ సౌయో మోటార్స్, అల్పాహారాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా మరియు టెస్ట్ రైడ్ల కోసం తమ సరికొత్త బైక్లలో కొన్నింటిని తీసుకురావడం ద్వారా ఈ ర్యాలీలో భాగస్వామిగా మారింది.
ఈ రైడ్ కోసం భద్రతా పరమైన సహాయం అందించేందుకు ఏర్పాటు కూడా చేశారు. దుబాయ్కు చెందిన 'రైడర్స్ ఛాయిస్' అనే అద్దె సంస్థ, ఒక మెకానిక్తో పాటు, బ్రేక్డౌన్ల సందర్భంలో మోటార్సైకిళ్లను రవాణా చేయగల సామర్థ్యం ఉన్న ఒక సహాయక వాహనాన్ని అందించింది.
"దీని కోసం మొత్తం కమ్యూనిటీ ఏకమైంది. 45కు పైగా మోటార్సైకిల్ గ్రూపులు మరియు చాలా మంది సోలో రైడర్లు ఇందులో పాల్గొన్నారు," అని కింగ్ తెలిపారు. అల్పాహారం తర్వాత, రైడర్లు తమ షెడ్యూల్లను బట్టి ఉదయం 9.30 గంటల నుండి చిన్న చిన్న బృందాలుగా తిరిగి వెళ్లడం ప్రారంభించారని పేర్కొన్నారు.
27 ఏళ్లకు పైగా యూఏఈలో ఉంటూ, 35 ఏళ్లకు పైగా రైడింగ్ అనుభవం ఉన్న కింగ్.. 'వరల్డ్ ఆఫ్ బైకర్స్' ఆలోచన గత సంవత్సరం ఒక సాధారణ వాట్సాప్ గ్రూప్గా మొదలై, ఇప్పుడు 680 మందికి పైగా సభ్యులకు పెరిగిందని చెప్పారు. ఈ ర్యాలీ బైకింగ్ కమ్యూనిటీ స్ఫూర్తిని ప్రతిబింబించిందని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







