అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

- April 04, 2026 , by Maagulf
అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని పనుల వేగాన్ని పెంచడంపై అధికారులకు, నిర్మాణ సంస్థలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ పని కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు.

రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు వారం, నెల వారీగా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే పూర్తి చేయాల్సిన కీలక పనులపై అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే కార్మికుల సంఖ్య పెంచుకోవాలని, ఎక్కడా జాప్యం జరగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com