అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- April 04, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని పనుల వేగాన్ని పెంచడంపై అధికారులకు, నిర్మాణ సంస్థలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ పని కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు.
రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు వారం, నెల వారీగా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే పూర్తి చేయాల్సిన కీలక పనులపై అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే కార్మికుల సంఖ్య పెంచుకోవాలని, ఎక్కడా జాప్యం జరగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







