అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- April 04, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని పనుల వేగాన్ని పెంచడంపై అధికారులకు, నిర్మాణ సంస్థలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ పని కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు.
రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు వారం, నెల వారీగా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే పూర్తి చేయాల్సిన కీలక పనులపై అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే కార్మికుల సంఖ్య పెంచుకోవాలని, ఎక్కడా జాప్యం జరగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







