ట్యాక్సీ మీటర్లను వ్యతిరేకిస్తున్న 'ఆరెంజ్' డ్రైవర్స్
- February 11, 2016
ఒమన్లో ట్యాక్సీలకు మీటర్ల వినియోగంపై దుమారం చెలరేగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆరెంజ్ ట్యాక్సీ డ్రైవర్స్ వ్యతిరేకించారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్తో జరిగిన సమావేశంలో ట్యాక్సీ ప్రతినిథులు ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ట్యాక్సీలకు మీటర్లను బిగించడం ద్వారా వినియోగదారులకు ఛార్జీల మోత మోగిపోతుందనీ, అది తమ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని 500 ఆరెంజ్ ట్యాక్సీ డ్రైవర్స్ తరఫున అధికార ప్రతినిథిగా వచ్చిన సులేమాన్ అల్ జర్దానీ చెప్పారు. అయితే ట్యాక్సీల్లో ప్రయాణించేవారు, ట్యాక్సీ డ్రైవర్లు అదనంగా సొమ్ములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు చేయడంతో ఈ మీటర్ ప్రతిపాదన చేయాల్సి వచ్చిందని రాయల్ ఒమన్ పోలీసులు అలాగే మంత్రివర్గ అధికారులు వెల్లడించారు. అయితే ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చినా, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదనీ, వద్దంటున్న మీటర్ విధానాన్ని తమకు ఇష్టం లేకపోయినా ఎలా అమలు చేయాలని అనుకుంటున్నారని ట్యాక్సీ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







