దుబాయ్లో 'సెల్ఫీకార్'
- February 12, 2016
దుబాయ్ని 2020 నాటికి డిజేబిలిటీ ఫ్రెండ్లీ సిటీగా మార్చే క్రమంలో వినూత్న ఆలోచనలతో ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. డిజి రోబోటిక్స్ తాజాగా డ్రైవర్ రహిత కారుని 'ది సెల్ఫీకార్' పేరుతో రూపొందించింది. ఈ ప్రొటో టైప్ కారు డిజేబులిటీతో బాధపడ్తున్నవారికోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఎలక్ట్రిక్ కారుని, డ్రైవర్లెస్ కార్గా రూపొందించామనీ, వీల్ఛెయిర్కే పరిమితమయ్యేవారికి ఈ కారు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డిజి రోబోటిక్స్ కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గౌతమ్ ఆహుజా చెప్పారు. యాక్సెస్ ఎబిలిటీ వర్క్షాప్నూ డిజి రోబోటిక్స్ కంపెనీ పాల్గొంది. ఎక్స్పోలో 30 దేశాల నుండి సుమారు 150 మంది ఎగ్జిబిటర్స్ పాల్గొంటున్నారు. సెల్ఫీ కార్ విషయానికి వస్తే ఓ బటన్ని ప్రెస్ చేస్తే కారులోని సీటు ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. టచ్ బటన్ లేదా వాయిస్ కమాండ్తో కారు నిర్దేశిత ప్రదేశానికి వెళ్ళేలా సాంకేతికతను అభివృద్ధి చేశారు. 2016 లోనే ఈ కారుని మార్కెట్లోకి తీసుకు వస్తామనీ 125,000 డాలర్ల నుంచి 130,000 డాలర్లదాకా ఈ కారు ఖరీదు ఉండవచ్చని ఆహుజా చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







