'వంగవీటి' చిత్రం ఆపేయాలని ఫిర్యాదు...
- February 11, 2016వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త వివాదంలో చిక్కుకోనున్నారు. ఆయనపై విజయవాడకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ కొత్తగా దర్శకత్వం వహించనున్న చిత్రం 'వంగవీటి' ఆపేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకప్పుడు విజయవాడను గడగడలాడించిన వంగవీటి రాధ కథ ఆధారంగా తాను వంగవీటి చిత్రాన్ని తీస్తున్నానని, ఇదే తెలుగులో తన ఆఖరి చిత్రం అవుతుందని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చింది. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో మరోసారి టెన్షన్ మొదలవుతుందని, వర్మ ఆ చిత్రాన్ని తెరకెక్కించడం ఆపేయాలంటూ గ్లోబల్ గాంధీ ట్రస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.వంగవీటి చిత్ర నిర్మాణాన్ని నిలువరించాలని ట్రస్టు విజయవాడ ఇంఛార్జి సీపీ ఎన్వీ సురేందర్ బాబు ఫిర్యాదులో కోరారు. 'రామ్ గోపాల్ వర్మ చిత్రం వంగవీటి ద్వారా ప్రశాంతంగా ఉన్న నగరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆ చిత్ర నిర్మాణాన్ని ఆపేయాలి' ఆయన కోరారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు