వీసా గడువు ముగిసిన యూఏఈ నివాసితులకు కీలక సూచన

- October 12, 2020 , by Maagulf
వీసా గడువు ముగిసిన యూఏఈ నివాసితులకు కీలక సూచన

యూఏఈ:మహమ్మారి కరోనా నేపథ్యంలో మార్చి 1 నుంచి జూలై 12 మధ్య వీసా ఎక్స్‌పైర్డ్ అయిన వారు అక్టోబర్ 10లోపు రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం 3 నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 10తో ఈ గడువు ముగిసింది కనుక ఇకపై వీసా గడువు ముగిసిన నివాసితులు దేశంలో ఉంటే భారీగా ఓవర్ స్టే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 11తో వీసా గడువు ముగిసిన నివాసితులకు ఈ ఓవర్ స్టే జరిమానాలు వర్తిస్తాయని ఎమిరేట్‌లోని అమిర్ సెంటర్ ఉద్యోగులు, వీసా కన్సల్టెంట్స్ స్పష్టం చేశారు. 

ఇక ఓవర్ స్టే జరిమానా కింద తొలిరోజు 125 దిర్హాములు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండో రోజు నుంచి ప్రతిరోజు 25 దిర్హాములు జరిమానా ఉంటుందని తెలిపారు. కాగా, వీసా దరఖాస్తుదారులలో అధికంగా భారతీయులతో పాటు పాకిస్తానీలు, ఈజిప్టియన్స్, ఫిలిప్పీనోస్ ఉన్నట్లు షార్జా లోని ASAT ట్రావెల్స్ మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ కుమార్ కొవ్వూరి తెలియజేశారు.వీరిలో చాలా మంది ఉద్యోగార్ధులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com