వీసా గడువు ముగిసిన యూఏఈ నివాసితులకు కీలక సూచన
- October 12, 2020
యూఏఈ:మహమ్మారి కరోనా నేపథ్యంలో మార్చి 1 నుంచి జూలై 12 మధ్య వీసా ఎక్స్పైర్డ్ అయిన వారు అక్టోబర్ 10లోపు రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం 3 నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 10తో ఈ గడువు ముగిసింది కనుక ఇకపై వీసా గడువు ముగిసిన నివాసితులు దేశంలో ఉంటే భారీగా ఓవర్ స్టే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 11తో వీసా గడువు ముగిసిన నివాసితులకు ఈ ఓవర్ స్టే జరిమానాలు వర్తిస్తాయని ఎమిరేట్లోని అమిర్ సెంటర్ ఉద్యోగులు, వీసా కన్సల్టెంట్స్ స్పష్టం చేశారు.
ఇక ఓవర్ స్టే జరిమానా కింద తొలిరోజు 125 దిర్హాములు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండో రోజు నుంచి ప్రతిరోజు 25 దిర్హాములు జరిమానా ఉంటుందని తెలిపారు. కాగా, వీసా దరఖాస్తుదారులలో అధికంగా భారతీయులతో పాటు పాకిస్తానీలు, ఈజిప్టియన్స్, ఫిలిప్పీనోస్ ఉన్నట్లు షార్జా లోని ASAT ట్రావెల్స్ మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ కుమార్ కొవ్వూరి తెలియజేశారు.వీరిలో చాలా మంది ఉద్యోగార్ధులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







