భారత్‌ - ఒమన్‌ సంబంధాల బలోపేతం

- February 13, 2016 , by Maagulf
భారత్‌ - ఒమన్‌ సంబంధాల బలోపేతం


ఒమన్‌ - భారత్‌ మధ్య సంబంధాలు వివిధ రంగాల్లో మరింత బలోపేతం కానున్నాయని ఇండియన్‌ ఎంబసీ వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామ్యం, సంబంధాల బలోపేతం వంటి అంశాల్లో ఇరు దేశాలూ ఓ అవగాహనతో ఉన్నాయని ఇండియన్‌ కోస్ట్‌ గాడ్డ్‌ షిప్‌ సంకల్ప్‌ నుంచి గ్లోరియా గాంగ్టే చెప్పారు. సంకల్ప్‌, ఇండియాకి చెందిన అత్యాధునికమైన ఆఫ్‌షోర్‌ పెట్రోల్‌ వెస్సెల్‌. ఒమన్‌ సందర్శన కోసం వచ్చింది ఈ వెస్సెల్‌. ఫిబ్రవరి 16 వరకు ఒమన్‌ తీరంలో ఉంటుంది. డిఫెన్స్‌ మరియు భద్రత విషయంలో పరస్పర సహకారం అందించుకోవాలని ఇరు దేశాల డిఫెన్స్‌ మినిస్ట్రర్స్‌ మధ్య చర్చలు జరిగినట్లు గాంగ్టే చెప్పారు. ఐఎన్‌ఎస్‌ తరంగిణి, షాబాబ్‌ ఒమన్‌ మస్కట్‌ నుంచి కొచ్చిన్‌ వరకు గతంలో ప్రయాణించాయి. ప్రాచీన కాలంలో ఇండియా, ఒమన్‌ల మధ్య జరిగిన సముద్ర వాణిజ్యాన్ని గుర్తుకు తెచ్చాయి. గత మూడేళ్ళలో ఇండియా నుంచి ఒమన్‌కి వచ్చిన కోస్ట్‌గార్డ్‌ షిప్స్‌లో సంకల్ప్‌ మూడవది. ఇందులో 16 మంది అధికారులు, 97 మంది ఆన్‌ బోర్డ్‌ పర్సనల్‌ ఉంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com