భారత్ - ఒమన్ సంబంధాల బలోపేతం
- February 13, 2016
ఒమన్ - భారత్ మధ్య సంబంధాలు వివిధ రంగాల్లో మరింత బలోపేతం కానున్నాయని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామ్యం, సంబంధాల బలోపేతం వంటి అంశాల్లో ఇరు దేశాలూ ఓ అవగాహనతో ఉన్నాయని ఇండియన్ కోస్ట్ గాడ్డ్ షిప్ సంకల్ప్ నుంచి గ్లోరియా గాంగ్టే చెప్పారు. సంకల్ప్, ఇండియాకి చెందిన అత్యాధునికమైన ఆఫ్షోర్ పెట్రోల్ వెస్సెల్. ఒమన్ సందర్శన కోసం వచ్చింది ఈ వెస్సెల్. ఫిబ్రవరి 16 వరకు ఒమన్ తీరంలో ఉంటుంది. డిఫెన్స్ మరియు భద్రత విషయంలో పరస్పర సహకారం అందించుకోవాలని ఇరు దేశాల డిఫెన్స్ మినిస్ట్రర్స్ మధ్య చర్చలు జరిగినట్లు గాంగ్టే చెప్పారు. ఐఎన్ఎస్ తరంగిణి, షాబాబ్ ఒమన్ మస్కట్ నుంచి కొచ్చిన్ వరకు గతంలో ప్రయాణించాయి. ప్రాచీన కాలంలో ఇండియా, ఒమన్ల మధ్య జరిగిన సముద్ర వాణిజ్యాన్ని గుర్తుకు తెచ్చాయి. గత మూడేళ్ళలో ఇండియా నుంచి ఒమన్కి వచ్చిన కోస్ట్గార్డ్ షిప్స్లో సంకల్ప్ మూడవది. ఇందులో 16 మంది అధికారులు, 97 మంది ఆన్ బోర్డ్ పర్సనల్ ఉంటారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







