సుప్రసిద్ధ కళా దర్శకులు ఆనంద సాయికి పవన్ కల్యాణ్ అభినందనలు
- October 16, 2020
హైదరాబాద్:యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించి – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటులు నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అబినందనలు తెలియచేశారు.
శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆనంద సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్









