ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- June 16, 2026
మస్కట్: వ్యాపారాలు మరియు కీలక ఆర్థిక రంగాలపై ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ఒమన్ సుల్తానేట్ సహాయక చర్యల ప్యాకేజీని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ ప్రకటించింది. దేశీయ ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం, ప్రపంచ పరిణామాల నుండి ఒత్తిళ్లను తగ్గించడం, కీలకమైన సఫ్లై చైన్ మరియు ఆహార భద్రతను పరిరక్షించడం కోసం ప్రభుత్వం చేస్తున్న సమగ్ర ప్రయత్నంలో భాగంగా ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపింది.
ప్రాథమిక చర్యలలో భాగంగా ఆహార భద్రతా సంస్థలకు విద్యుత్ టారిఫ్లను స్థిరీకరించనున్నారు. డిసెంబర్ 2026 వరకు వినియోగ పరిమాణాలతో సంబంధం లేకుండా కిలోవాట్-గంటకు 12 బైసాలకు పరిమితం చేస్తారు. దీంతోపాటు జాతీయ ఆహార సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, భారతీయ ఓడరేవుల నుండి దిగుమతి చేసుకున్న ఆహార వస్తువుల సముద్ర రవాణాకు ఆరు నెలల పాటు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఆమోదించింది.
నిర్మాణ మరియు పర్యాటక పరిశ్రమలకు సహాయపడటానికి, రీబార్ స్టీల్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు సంవత్సరాంతం వరకు 5 శాతంగా స్థిరంగా కొనసాగించనున్నారు. అలాగే, ఆతిథ్య సంస్థల నుండి 4 శాతం పర్యాటక సుంకం వసూలును మూడు నెలల పాటు వాయిదా వేయనున్నారు. చిన్న మరియు మధ్య తరహా సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రుణ వాయిదాలను వాయిదా వేసే సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







