యూఏఈ జెండాని అవమానిస్తే పాతికేళ్ళ వరకు జైలు
- November 10, 2020
అబుధాబి: యూఏఈ జాతీయ జెండాని అవమానించినా, దుర్వినియోగం చేసినా కరిÄనమైన శిక్షలు తప్పవని హెచ్చరించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఈ నేరానికి 10 నుంచి 25 ఏళ్ళ వరకు జైలు శిక్ష అలాగే 500,000 దిర్హాముల వరకు జరీమానా విధించే అవకాశం వుంటుంది. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాల్ని స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. జెండా అనేది జాతీయ ఐక్యతకు గుర్తు అని ఆ ట్వీట్స్లో పేర్కొన్నారు. చట్టాల పట్ల అవగాహన పెంచే క్రమంలో ఈ ప్రమోషన్ క్యాంపెయిన్ని సోషల్ మీడియా వేదికగా చేపట్టారు. ఆర్టికల్ 3, ఫెడరల్ చట్టం నెంబర్ 2 ఆఫ్ 1971, సంబంధిత అమెండ్మెంట్స్ ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా జాతీయ జెండాని అవమానిస్తే వారిపై పైన పేర్కొన్న విధంగా చర్యలు తీసుకోబడతాయి.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









