పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- May 15, 2026
పంజాబ్స్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. పంజాబ్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 201 రన్స్ టార్గెట్ ను ముంబై మరో బంతి మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 6 వికెట్ల తేడాతో పంజాబ్ ను చిత్తు చేసింది. ముంబై బ్యాటర్లలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
33 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. చివరి వరకు క్రీజులో నిలబడి ముంబై విజయంలో కీ రోల్ ప్లే చేశాడు తిలక్ వర్మ. ఈ టోర్నీ నుంచి ఇప్పటికే ముంబై నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు పంజాబ్ పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ కు ఇది వరుసగా 5వ పరాజయం. తొలుత ఓటమి అన్నది లేకుండా రాణించిన పంజాబ్.. ఇప్పుడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







