హైదరాబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్
- November 12, 2020
హైదరాబాద్:కరోనా కట్టడికి రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు భారత్కు చేరుకున్నాయి.హైదరాబాద్ చేరిన ఈ వ్యాక్సిన్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాక్సిన్పై 2-3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్కు అనుమతులు దక్కాయి. త్వరలోనే ఈ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కరోనా నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తెలిపాయి. దాదాపు 40వేల మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన.. తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







