హైదరాబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్
- November 12, 2020
హైదరాబాద్:కరోనా కట్టడికి రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు భారత్కు చేరుకున్నాయి.హైదరాబాద్ చేరిన ఈ వ్యాక్సిన్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాక్సిన్పై 2-3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్కు అనుమతులు దక్కాయి. త్వరలోనే ఈ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కరోనా నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తెలిపాయి. దాదాపు 40వేల మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన.. తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







