దుబాయ్, షార్జాలో పోస్ట్ కోవిడ్ రికవరి ఆస్పత్రులను ప్రారంభించిన యూఏఈ
- November 13, 2020
కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు..వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఇది ఆశాజనకమైన అంశమే అయినా..వైరస్ నుంచి బయటపడిన వారిలో ఇంకా దాని తాలుకు దుష్ప్రభావం రోగులను వెంటాడుతుండటం మరో సమస్యగా మారుతోంది. నిజానికి కోవిడ్ నుంచి కోలుకొని నెగటివ్ రిపోర్ట్ వచ్చినా..అంతకుముందున్నట్లుగా సంపూర్ణ ఆరోగ్యంగా మాత్రం ఉండటం లేదు. దీర్ఘకాలంలో శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో పాటు మతిమరుపు, ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో కోవిడ్ అనంతరం దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా పోస్ట్ కోవిడ్ రికవరి ఆస్పత్రులను ప్రారంభించింది. దుబాయ్, షార్జాలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రులలో కోవిడ్ నుంచి కోలుకొని..దాని తాలుకు దుష్ప్రభావాన్ని ఎదుర్కుంటున్న వారికి అవసరమైన చికిత్స అందిస్తారు. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం కూడా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కునే రోగులను ముందుగా పరిశీలించి వారికి ఏ తరహా చికిత్స అవసరమో..ఆ స్పెషలిస్ట్ కు రిఫర్ చేస్తారు. దీంతో బాధితులు పూర్తిగా కోలుకునేందుకు ఆస్కారం ఏర్పడుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన