దుబాయ్, షార్జాలో పోస్ట్ కోవిడ్ రికవరి ఆస్పత్రులను ప్రారంభించిన యూఏఈ
- November 13, 2020
కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు..వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఇది ఆశాజనకమైన అంశమే అయినా..వైరస్ నుంచి బయటపడిన వారిలో ఇంకా దాని తాలుకు దుష్ప్రభావం రోగులను వెంటాడుతుండటం మరో సమస్యగా మారుతోంది. నిజానికి కోవిడ్ నుంచి కోలుకొని నెగటివ్ రిపోర్ట్ వచ్చినా..అంతకుముందున్నట్లుగా సంపూర్ణ ఆరోగ్యంగా మాత్రం ఉండటం లేదు. దీర్ఘకాలంలో శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో పాటు మతిమరుపు, ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో కోవిడ్ అనంతరం దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా పోస్ట్ కోవిడ్ రికవరి ఆస్పత్రులను ప్రారంభించింది. దుబాయ్, షార్జాలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రులలో కోవిడ్ నుంచి కోలుకొని..దాని తాలుకు దుష్ప్రభావాన్ని ఎదుర్కుంటున్న వారికి అవసరమైన చికిత్స అందిస్తారు. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం కూడా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కునే రోగులను ముందుగా పరిశీలించి వారికి ఏ తరహా చికిత్స అవసరమో..ఆ స్పెషలిస్ట్ కు రిఫర్ చేస్తారు. దీంతో బాధితులు పూర్తిగా కోలుకునేందుకు ఆస్కారం ఏర్పడుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







