యూఏఈ : సీవేజ్ పిట్ లో పడి ఆరేళ్ల బాలుడు మృతి
- November 13, 2020
యూఏఈ: తల్లిదండ్రుల నిర్లక్ష్యం తమ ఒకగానొక కుమారుడ్ని బలి తీసుకుంది. రస్ అల్ ఖైమా పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. రషిద్ అహ్మద్ అనే అరేళ్ల బాలుడు..తమ ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటూ మురుగు నీటి ట్యాంక్ లో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కొడుకు కోసం అతని తల్లి ఇంట్లో వెతకటం ప్రారంభించింది. ఎంతకీ కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన ఆమె భర్త, సోదరుడు కూడా బాబు కోసం ఇల్లంతా గాలించారు. మ్యాన్ హోల్ తెరిచి ఉంచంటంతో మురుగు నీటిలో పడిపోయాడేమోననే అనుమానంతో ట్యాంక్ లో కూడా చూశారు. అప్పటికే మృతి చెందిన బాబు మృతదేహం అడుక్కువెళ్లిపోవటంతో కుటుంబసభ్యులు గమనించలేకపోయారు. బాబు ఆచూకీ లేకపోవటంతో మరింత ఆందోళన చెందిన కుటుంబసభ్యులు రస్ ఆల్ ఖైమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు...ఘటన స్థలానికి సివిల్ డిఫెన్స్ బృందాలను ఘటనా స్థలానికి పంపించారు. ఇల్లంతా వెతికిన బృందాలు..చివరికి పెద్ద కర్రతో మురుగు నీటి గుంటలో వెతికారు. కర్రకు బాబు మృతదేహాం తగలటంతో ట్యాంక్ నుంచి బయటికి తీశారు. అప్పటివరకు చలాకీగా ఆడుకున్న కొడుకుని...విగతజీవిగా చూసేసరికి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు తమ నిర్లక్ష్యంతో బలితీసుకున్నామని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ తల్లిదండ్రుల ఆవేదన చుట్టుపక్కల వాళ్లను కూడా చలించేలా చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







