యూఏఈ : సీవేజ్ పిట్ లో పడి ఆరేళ్ల బాలుడు మృతి
- November 13, 2020
యూఏఈ: తల్లిదండ్రుల నిర్లక్ష్యం తమ ఒకగానొక కుమారుడ్ని బలి తీసుకుంది. రస్ అల్ ఖైమా పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. రషిద్ అహ్మద్ అనే అరేళ్ల బాలుడు..తమ ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటూ మురుగు నీటి ట్యాంక్ లో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కొడుకు కోసం అతని తల్లి ఇంట్లో వెతకటం ప్రారంభించింది. ఎంతకీ కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన ఆమె భర్త, సోదరుడు కూడా బాబు కోసం ఇల్లంతా గాలించారు. మ్యాన్ హోల్ తెరిచి ఉంచంటంతో మురుగు నీటిలో పడిపోయాడేమోననే అనుమానంతో ట్యాంక్ లో కూడా చూశారు. అప్పటికే మృతి చెందిన బాబు మృతదేహం అడుక్కువెళ్లిపోవటంతో కుటుంబసభ్యులు గమనించలేకపోయారు. బాబు ఆచూకీ లేకపోవటంతో మరింత ఆందోళన చెందిన కుటుంబసభ్యులు రస్ ఆల్ ఖైమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు...ఘటన స్థలానికి సివిల్ డిఫెన్స్ బృందాలను ఘటనా స్థలానికి పంపించారు. ఇల్లంతా వెతికిన బృందాలు..చివరికి పెద్ద కర్రతో మురుగు నీటి గుంటలో వెతికారు. కర్రకు బాబు మృతదేహాం తగలటంతో ట్యాంక్ నుంచి బయటికి తీశారు. అప్పటివరకు చలాకీగా ఆడుకున్న కొడుకుని...విగతజీవిగా చూసేసరికి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు తమ నిర్లక్ష్యంతో బలితీసుకున్నామని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ తల్లిదండ్రుల ఆవేదన చుట్టుపక్కల వాళ్లను కూడా చలించేలా చేసింది.
తాజా వార్తలు
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!







