జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.5,600 కోట్లు..
- February 16, 2016
గృహ నిర్మాణాలకు పెద్దపీట ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి (2016-17) జీహెచ్ఎంసీ భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ లేని విధంగా రూ.5,600 కోట్లతో బడ్జెట్ను రూపొందించింది. గతనెలలోనే దీన్ని ప్రభుత్వానికి నివేదించినప్పటికీ.. ఇప్పటిదాకా వివరాలు వెల్లడి కాలేదు. స్టాండింగ్ కమిటీ లేకపోవడంతో జీహెచ్ఎంసీ స్పెషలాఫీసరే బడ్జెట్ను రూపొందించి, ఆమోదించి, ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం లాంఛనంగా ఆమోదిస్తుంది. కొత్త పాలక మండలి ఏర్పాటు కావడంతో సమాచారం నిమిత్తం కొత్తగా కొలువు దీరే సభ ముందుంచనున్నారు.అంతకుమించి మార్పులేమీ ఉండబోవని తెలుస్తోంది. రహదారులు, వరద కాలువలపై బడ్జెట్లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. పేదలకు గృహ నిర్మాణం, శుద్ధ జలం, గ్రీన్ హైదరాబాద్ వంటి వాటికి కూడా ప్రాధాన్యతనిచ్చారు. కొత్త బడ్జెట్లో అత్యధికంగా ఎస్సార్డీపీ పనులకు రూ.1000 కోట్లు, రహదారులకు 860 కోట్లు చూపారు. రహదారుల నిర్వహణకు 110.73 కోట్లు, నాలాల నిర్వహణకు రూ.76.61 కోట్లు చూపారు. వరద కాలువలు, రహదారులు, ఫ్లై ఓవర్లకు కలిపి రూ.2,180 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. 2015-16 బడ్జెట్ను రూ.5,550 కోట్లకు ఆమోదించగా, రివైజ్డ్ బడ్జెట్లో దాన్ని రూ. 5091 కోట్లకు తగ్గించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







