రెండోసారి క్వారంటైన్లో బ్రిటన్ ప్రధాని
- November 16, 2020
లండన్: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి క్వారంటైన్లోకి వెళ్లారు. ప్రధానిని కలిసిన చట్టసభ్యుల బృందంలోని కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు లీ అండర్సన్కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బోరిస్ జాన్సన్ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. కరోనా రోగిని ప్రధాని కలిసిన నేపథ్యంలో ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
బోరిస్ ఈ ఏడాది మార్చిలో కరోనా మహమ్మారి బారినపడి వైద్యుల పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్న బోరిస్ మళ్లీ బాధ్యతల్లో తలమునకలయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!









