డాక్యుమెంట్లు లేని వలసదారులకు ఎంబసీ వద్ద ఔట్పాస్లు
- November 16, 2020
మస్కట్: దేశం విడిచి వెళ్ళాలనుకునే వలసదారుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం మొదలైంది. ఎలాంటి రుసుములు చెల్లించకుండానే దేశం విడిచి వెళ్ళేందుకు కల్పించిన ఈ అవకాశం డిసెంబర్ 31 వరకు అందుబాటులో వుంటుంది. మినిస్ట్రీ & టాఫ్ లేబర్ వెబ్సైట్ (mol.gov.om)లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వర్క్ వీసా గడువు తీరిన వలస కార్మికులు, స్వదేశానికి వెళ్ళేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించారు. మినిస్ట్రీకి చెందిన వెబ్సైట్తోపాటు సనద్ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ జరిగిన ఏడు రోజుల తర్వాత, విమాన ప్రయాణానికి ఏడు గంటల ముందు వలస కార్మికుడు మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కార్యాలయాన్ని సందర్శించాల్సి వుంటుంది. చెల్లుబాటయ్యే టిక్కెట్టు అలాగే ట్రావెల్ డాక్యుమెంట్లు, 72 గంటల ముందుగా చేయించుకున్న పీసీఆర్ టెస్ట్ వివరాలు తమ వెంట తీసుకెళ్ళాలి. వలసదారులు, సరైన డాక్యుమెంటేషన్ లేనిపక్షంలో, వారు ఎంబసీలను సంప్రదించాలి. పాస్పోర్ట్ లేనివారు కూడా, ఎంబసీ జారీ చేసే ఔట్పాస్తో స్వదేశానికి వెళ్ళవచ్చు. బంగ్లాదేశీ వలసదారులు బర్త్ రిజిస్ట్రేషన్ కార్డు, పాస్పోర్ట్ కాపీ లేదా నేషనల్ ఐడీ కార్డుని సమర్పించాలి. సామాజిక కార్యకర్తలు ఆయా ఎంబసీలతో కలిసి వలసదారులకు సహాయ సహకారాలు అందిస్తారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









