రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకేసారి రంగంలోకి
- February 17, 2016
మెగాహీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకేసారి రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 18న మెగా అభిమానులకు డబుల్ బొనాంజా అందించేందుకు రెడీ అవుతున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరైనోడు' గురువారం టీజర్తో సిద్ధమౌతుండగా...అదే రోజు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ 'తనీ ఒరువన్' రీమేక్ను మొదలు పెట్టనున్నాడు. ఆ చిత్రానికిగానూ 'రక్షక్' టైటిల్లో పరిశీలనలో ఉండగా....రీసెంట్గా 'ధృవ' అనే టైటిల్ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 18న సెట్స్పైకి వెళ్తోంది. ఇలా బన్నీ, చరణ్లు ఒకేసారి రంగంలోకి దిగుతున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు ఒకే రోజున రావడంతో మెగా ఫ్యామిలీ అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ రెండు చిత్రాలు గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే చిత్రీకరించడం విశేషం. ఇదిలా ఉంటే గీతా ఆర్ట్స్ సంస్థ ఈ ఏడాది చిత్రనిర్మాణంలో మరింత జోరు పెంచింది. ప్రస్తుతం ఈ బ్యానర్లో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. తన ఇద్దరు కొడుకుల సినిమాలతో పాటు మేనల్లుడి సినిమాను కూడా నిర్మిస్తున్నాడు అల్లు అరవింద్. బన్నీ హీరోగా "సరైనోడు" సినిమా నిర్మిస్తున్న అరవింద్.. మరోవైపు అల్లు శిరీష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో "శ్రీరస్తు శుభమస్తు" సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక చరణ్ "తనీ ఒరువన్" రీమేక్ ను ఎన్.వి.ప్రసాద్ తో కలసి నిర్మించబోతున్నాడు. సో.. ముగ్గురు మెగా ఫ్యామిలీ హీరోలతో ఈ ఏడాది మూడు సినిమాలు నిర్మిస్తున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







