రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకేసారి రంగంలోకి
- February 17, 2016
మెగాహీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకేసారి రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 18న మెగా అభిమానులకు డబుల్ బొనాంజా అందించేందుకు రెడీ అవుతున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరైనోడు' గురువారం టీజర్తో సిద్ధమౌతుండగా...అదే రోజు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ 'తనీ ఒరువన్' రీమేక్ను మొదలు పెట్టనున్నాడు. ఆ చిత్రానికిగానూ 'రక్షక్' టైటిల్లో పరిశీలనలో ఉండగా....రీసెంట్గా 'ధృవ' అనే టైటిల్ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 18న సెట్స్పైకి వెళ్తోంది. ఇలా బన్నీ, చరణ్లు ఒకేసారి రంగంలోకి దిగుతున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు ఒకే రోజున రావడంతో మెగా ఫ్యామిలీ అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ రెండు చిత్రాలు గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే చిత్రీకరించడం విశేషం. ఇదిలా ఉంటే గీతా ఆర్ట్స్ సంస్థ ఈ ఏడాది చిత్రనిర్మాణంలో మరింత జోరు పెంచింది. ప్రస్తుతం ఈ బ్యానర్లో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. తన ఇద్దరు కొడుకుల సినిమాలతో పాటు మేనల్లుడి సినిమాను కూడా నిర్మిస్తున్నాడు అల్లు అరవింద్. బన్నీ హీరోగా "సరైనోడు" సినిమా నిర్మిస్తున్న అరవింద్.. మరోవైపు అల్లు శిరీష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో "శ్రీరస్తు శుభమస్తు" సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక చరణ్ "తనీ ఒరువన్" రీమేక్ ను ఎన్.వి.ప్రసాద్ తో కలసి నిర్మించబోతున్నాడు. సో.. ముగ్గురు మెగా ఫ్యామిలీ హీరోలతో ఈ ఏడాది మూడు సినిమాలు నిర్మిస్తున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









