శిల్పాశెట్టి తెలంగాణా లో కంపెనీ పెట్టబోతుంది...
- February 17, 2016
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక అనేక సంస్థలు తమ పెట్టుబడి ని పెట్టడానికి ముందుకు వస్తున్నాయి..ఇప్పటికే చాల కంపెనీ లు తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.. ఇక మొబైల్ రంగం వారు కూడా తమ కంపెనీ పరిశ్రమలను తెలంగాణా లో ఏర్పాటు చేయడానికి వచ్చారు. వారిలో మైక్రోమ్యాక్స్, సెల్ కాన్ తదితర కంపెనీలు మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో మొబైల్ పరిశ్రమ కన్ను తెలంగాణా ఫై పడింది.అది కూడా ఓ ప్రముఖ బాలీవుడ్ నటికి చెందినది కావడం విశేషం. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి గత ఏడాది హిందుస్థాన్ సేప్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ (హెచ్ఎస్జీఐ) ద్వారా వారి కుమారుడు 'వివాన్' పేరిట సెల్ ఫోన్ల తయారీకి శ్రీకారం చుట్టారు.ఈ నేపద్యం లో శిల్పాశెట్టి భాగస్వామిగా ఉన్న హెచ్ఎస్జీఐ ఇప్పుడు తెలంగాణాలో సెల్ ఫోన్ తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







