శిల్పాశెట్టి తెలంగాణా లో కంపెనీ పెట్టబోతుంది...
- February 17, 2016
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక అనేక సంస్థలు తమ పెట్టుబడి ని పెట్టడానికి ముందుకు వస్తున్నాయి..ఇప్పటికే చాల కంపెనీ లు తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.. ఇక మొబైల్ రంగం వారు కూడా తమ కంపెనీ పరిశ్రమలను తెలంగాణా లో ఏర్పాటు చేయడానికి వచ్చారు. వారిలో మైక్రోమ్యాక్స్, సెల్ కాన్ తదితర కంపెనీలు మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో మొబైల్ పరిశ్రమ కన్ను తెలంగాణా ఫై పడింది.అది కూడా ఓ ప్రముఖ బాలీవుడ్ నటికి చెందినది కావడం విశేషం. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి గత ఏడాది హిందుస్థాన్ సేప్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ (హెచ్ఎస్జీఐ) ద్వారా వారి కుమారుడు 'వివాన్' పేరిట సెల్ ఫోన్ల తయారీకి శ్రీకారం చుట్టారు.ఈ నేపద్యం లో శిల్పాశెట్టి భాగస్వామిగా ఉన్న హెచ్ఎస్జీఐ ఇప్పుడు తెలంగాణాలో సెల్ ఫోన్ తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









