శిల్పాశెట్టి తెలంగాణా లో కంపెనీ పెట్టబోతుంది...

- February 17, 2016 , by Maagulf
శిల్పాశెట్టి  తెలంగాణా లో కంపెనీ పెట్టబోతుంది...

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక అనేక సంస్థలు తమ పెట్టుబడి ని పెట్టడానికి ముందుకు వస్తున్నాయి..ఇప్పటికే చాల కంపెనీ లు తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.. ఇక మొబైల్ రంగం వారు కూడా తమ కంపెనీ పరిశ్రమలను తెలంగాణా లో ఏర్పాటు చేయడానికి వచ్చారు. వారిలో మైక్రోమ్యాక్స్, సెల్ కాన్ తదితర కంపెనీలు మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో మొబైల్ పరిశ్రమ కన్ను తెలంగాణా ఫై పడింది.అది కూడా ఓ ప్రముఖ బాలీవుడ్ నటికి చెందినది కావడం విశేషం. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి గత ఏడాది హిందుస్థాన్ సేప్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ (హెచ్ఎస్జీఐ) ద్వారా వారి కుమారుడు 'వివాన్' పేరిట సెల్ ఫోన్ల తయారీకి శ్రీకారం చుట్టారు.ఈ నేపద్యం లో శిల్పాశెట్టి భాగస్వామిగా ఉన్న హెచ్ఎస్జీఐ ఇప్పుడు తెలంగాణాలో సెల్ ఫోన్ తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com