మస్కట్ లో బీచ్ లలో కుటుంబాలతో గడిపేవారికి ప్రత్యేక ప్రాంతాలు
- February 17, 2016
ఆకతాయిల నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా... ఏకాంతం భంగపదకుండా ఉండేందుకు మస్కట్ సముద్రతీరాల్లో కుటుంబాలతో సేద తీరే వారికి మునిసిపాలిటి ప్రతేక ఏర్పాట్లు చేసింది. బుషేర్ , కురియత్ , సీబ్ ప్రాంతాలలోని 6 బీచ్ లలో ..కేవలం కుటుంబ సభ్యులథొ గడిపేవారికి మాత్రమె ఇక్కడ అనుమతిస్తారు. ఇక ధూమపానంకు అనుమతి లేదు. అదే విధంగా కార్లలో బైకులతో ఈ ప్రాంతంలో చక్కర్లు కొట్టకూడదని మున్సిపాలిటీ ఉన్నతాదికారి ఒమాన్ టైమ్స్ కు తెలిపారు. సముద్రతీరంలో కుటుంబంతో సంతోషంగా గడిపేవారికి శుభవార్త కాగా, సముద్రపు ఒడ్డున అల్లరి చిల్లర చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించబడాలనుకొనే కొంతమంది కుర్ర గ్యాంగులకు ఇది మింగుడుపడని నిర్ణయం. 600మీటర్ల నుంచి 1000 మీటర్ల వరుకు కుటుంబాలకు కేటాయిస్తారు. కుటుంబాలతో బీచ్ లకు వెళుతుంటే, కొంతమంది ఇబ్బందులు కల్గిస్తున్నారని పలు పిర్యాదులు తమకు అందిన నేపద్యంలో మస్కట్ మునిసిపాలిటి అధికారులు కుటుంబాలతో గడిపేవారికి ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







