యూఏఈలో ఇండియన్ కాన్సులర్ సర్వీసులు చవక
- February 17, 2016
పాస్పోర్ట్ మరియు కాన్సులర్ సర్వీసులు యూఏఈలోని భారత వలసదారులకు చవక కానున్నాయి. అబుదాబీలో ఇండియన్ మిషన్ ద్వారా ఎంపిక కానున్న కొత్త సర్వీస్ ప్రొవైడర్ ద్వారా తక్కువ ఖర్చుతో పలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంబసీ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపోజల్స్ కోసం ఆహ్వానాలు పంపింది. ప్రస్తుతం ఈ సర్వీసులు అందిస్తున్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ముగియడంతో కొత్త సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక జరగనుంది. ప్రస్తుతం ఇది బిడ్డింగ్ దశలోఉంది. జనవరి 31తో వాస్తవానికి బిడ్ గడువు ముగియగా, 20 కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే ఇంకాస్త గడువు పొడిగించమనే విజ్ఞప్తులు రావడంతో, ఫిబ్రవరి 29 వరకు అవకాశమిచ్చారు. తక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీలకు పాస్పోర్ట్, కాన్సులర్ సర్వీసులు అందించే ఛాన్స్ దక్కనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







