యూఏఈలో ఇండియన్‌ కాన్సులర్‌ సర్వీసులు చవక

- February 17, 2016 , by Maagulf
యూఏఈలో ఇండియన్‌ కాన్సులర్‌ సర్వీసులు చవక

పాస్‌పోర్ట్‌ మరియు కాన్సులర్‌ సర్వీసులు యూఏఈలోని భారత వలసదారులకు చవక కానున్నాయి. అబుదాబీలో ఇండియన్‌ మిషన్‌ ద్వారా ఎంపిక కానున్న కొత్త సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా తక్కువ ఖర్చుతో పలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంబసీ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపోజల్స్‌ కోసం ఆహ్వానాలు పంపింది. ప్రస్తుతం ఈ సర్వీసులు అందిస్తున్న బిఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ కాంట్రాక్ట్‌ ముగియడంతో కొత్త సర్వీస్‌ ప్రొవైడర్‌ ఎంపిక జరగనుంది. ప్రస్తుతం ఇది బిడ్డింగ్‌ దశలోఉంది. జనవరి 31తో వాస్తవానికి బిడ్‌ గడువు ముగియగా, 20 కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే ఇంకాస్త గడువు పొడిగించమనే విజ్ఞప్తులు రావడంతో, ఫిబ్రవరి 29 వరకు అవకాశమిచ్చారు. తక్కువ ధరకు కోట్‌ చేసిన కంపెనీలకు పాస్‌పోర్ట్‌, కాన్సులర్‌ సర్వీసులు అందించే ఛాన్స్‌ దక్కనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com