విజయవాడ లో గురునానక్ జయంతి వేడుకలు
- November 29, 2020
విజయవాడ:గురునానక్ జయంతి సందర్బంగా నగరంలోని గురునానక్ కాలనీలోని గురుద్వార్లో జరుగుతున్న గురుపూరబ్ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ పాల్గొన్నారు.
ఆదివారం ఈ సందర్భంగా గురుద్వార్ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
విశిష్ట రోజుగా భావించే కార్తీక పౌర్ణమి రోజునే గురునానక్ పుట్టిన రోజు కావడం సిక్కులు పర్వదినం.గురునానక్ హిందు, ఇస్లామిక్ దివ్యగ్రంథాలను అధ్యయనం చేశారని కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు.
అదేవిధంగా గురుసింగ్ సహధర్మ ప్రచార్ కమిటీ ప్రతినిధులు ఆహ్వానం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్రెడ్డి సోమవారం గురుద్వార్ను సందర్శించి ఉత్సవాలలో పాల్గొననున్నారని సీఎంవో నుంచి అందిన సమాచారంతో సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లపై కమిటీ ప్రతినిధులతో చర్చించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)కె.మోహన్కుమార్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ సభ్యులు ఎస్.హర్ మహీంద్ర సింగ్, వైయస్సార్సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు