నేటి నుంచి మూడ్రోజుల పాటు కుంభమేళా..
- February 19, 2016
దక్షిణ కాశీగా భావించే తిరుమ కూడలు నరసీపురలో శనివారం నుంచి మూడ్రోజుల పాటు కుంభమేళాను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నదిలో నీరు తక్కువగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలోని వివధ ప్రాంతాల నుంచి 250మందికి పైగా సాధువులు రానున్నట్లు అంచనా. మూడ్రోజుల పాటు సాగనున్న కుంభమేళాలో 15లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని నిర్వాహకులు తెలిపారు. తిరుమకూడలు నరసీపురలో కావేరి, కపిల, స్పటిక నదులు కలుస్తాయి.దక్షిణాది భక్తులు హరిద్వారకు వెళ్లడం కష్టంగా ఉన్నందున 1989 నుంచి ప్రతీ మూడేళ్లకోసారి కుంభమేళాను నిర్వహిస్తున్నారు. ఈసారి నిర్వహిస్తున్న మేళా పదవది. కుంభమేళా సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సదుపాయాన్ని కల్పించారు. వాహన సంచారానికి సమస్య ఎదురవకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అభినవ ఖరె తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







