మేడారం సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు 15 లక్షల మంది...
- February 19, 2016
మేడారం సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో గద్దెల వద్దకు తరలివచ్చారు. సాయంత్రం 7గంటల వరకు సుమారు 15 లక్షల మంది అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ భక్తులు అధికసంఖ్యలో కూలైన్లలో వేచియున్నారు. ఒకేసారి వేలసంఖ్యలో అమ్మవార్లను దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్దఎత్తున క్యూలైన్లలో భక్తులు ఉన్నప్పటికీ 3 నుంచి 4 గంటల్లో దర్శనం అవుతోంది. శుక్రవారం ఒక్కరోజే 50లక్షల మంది వరకు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.పోలీసు, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉండి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. భారీగా భక్తులు తరలివస్తున్నందున వీఐపీలు ఎవరూ రావొద్దని అధికారులు విన్నవించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







