మేడారం సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు 15 లక్షల మంది...

- February 19, 2016 , by Maagulf
మేడారం సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు 15 లక్షల మంది...

మేడారం సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో గద్దెల వద్దకు తరలివచ్చారు. సాయంత్రం 7గంటల వరకు సుమారు 15 లక్షల మంది అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ భక్తులు అధికసంఖ్యలో కూలైన్లలో వేచియున్నారు. ఒకేసారి వేలసంఖ్యలో అమ్మవార్లను దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్దఎత్తున క్యూలైన్లలో భక్తులు ఉన్నప్పటికీ 3 నుంచి 4 గంటల్లో దర్శనం అవుతోంది. శుక్రవారం ఒక్కరోజే 50లక్షల మంది వరకు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.పోలీసు, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉండి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. భారీగా భక్తులు తరలివస్తున్నందున వీఐపీలు ఎవరూ రావొద్దని అధికారులు విన్నవించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com