దుబాయ్ పర్యాటకులకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్...
- December 13, 2020
దుబాయ్:లాక్ డౌన్ ఎత్తివేసినా వ్యాపార రంగాన్ని మాత్రం ఇంకా కోవిడ్ సంక్షోభాన్ని వెంటాడుతూనే ఉంది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా దుబాయ్ లో పలు పర్యాటక కేంద్రాలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే..అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవటంతో పర్యాటక రంగం మాత్రం ఇంకా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. అయితే..తమ పరిధిలోని పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు దుబాయ్ యంత్రాంగం విదేశీ పర్యాటకుల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో ప్రయాణించిన వారికి 5 స్టార్ హోటల్ లో ఫ్రీగా బస ఏర్పాటు చేస్తోంది. ఎకనామి క్లాస్ లో ప్రయాణించిన వారికి మారియట్ మార్క్యూస్ లో ఓ రాత్రి ఉచితంగా బస చేయవచ్చు. ఇక బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు రెండు రాత్రుళ్లు ఉచితంగా బస సౌకర్యాన్ని అందించనున్నారు. ఈ ఆఫర్ ఈ నెల 6 నుంచి వచ్చే ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







