తెలంగాణలో కొత్తగా 384 కేసుల నమోదు
- December 14, 2020
హైదరాబాద్: తెలంగాణ కొత్తగా 384 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది. వీటిలో 101 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగుచూశాయి. నిన్న కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటి వరకు ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 1,496కు పెరిగింది.
ఇక కొవిడ్కు చికిత్స పొందుతూ నిన్న 631 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,69,232కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,57,683 నిర్ధారణ పరీక్షలు చేయగా, గత రాత్రి 8 గంటల వరకు 28,980 మందిని పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,380 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. వీరిలో 5,298 మంది హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









