యువతరానికి భగవద్గీత చదవడం నేర్పించాలి-టి.గవర్నర్‌

- December 17, 2020 , by Maagulf
యువతరానికి భగవద్గీత చదవడం నేర్పించాలి-టి.గవర్నర్‌

హైదరాబాద్‌:యువతరానికి భగవద్గీత చదవడం నేర్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. భగవద్గీత చదవడాన్ని ఒక అలవాటుగా మార్చితే జీవితంలో ఎంతో ఉన్నత స్ధితికి చేరడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. గీతాపారాయనం ద్వారా జీవితంలో ఏది సాధించాలన్నా ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, రక రకాల సమస్యలను అధిగమించడానికి ఉపయోగ పడుతుందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక భరతి, ప్రజ్ఞాభారతి, ఇంపాక్ట్‌ ఫౌండేషన్‌ సయుక్తంగా నిర్వహించిన గీతా జ్ఞాన సప్తాహాన్ని గవర్నర్‌ రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవద్గీత ద్వారా ఎందరో మహానుభావులు మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద వంటి వారు స్పూర్తి పొందారని అన్నారు. ప్రపంచంలోనే వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ఉత్తమైన  గ్రంధమని చెప్పారు. మానవులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే గ్రంధమని తెలిపారు.చేసే పనిలో అంకితభావం, క్రమశిక్షణ నేర్పించే గ్రంధమని అన్నారు, భగవద్గీత పారాయణం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు రుజువు చేశాయని గవర్నర్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com