దుబాయ్-ఢిల్లీ ఇండిగో విమానంలో సీటు కింద బంగారం పట్టివేత
- December 19, 2020న్యూ ఢిల్లీ:దుబాయ్ నుంచి ఢిల్లీకి చేరిన ఇండిగో విమానంలో ఓ సీటు కింద దాచిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సకనుగొన్నారు. రూ.49.9 లక్షల విలువైన 1.13 కేజీల ఈ బంగారం సిలిండ్రికల్ రాడ్స్ రూపంలో ఉంది. విమానంలోని సీటు ట్రాక్ గార్డ్స్ లో ఎవరికీ కనబడకుండా నేర్పుగా దీన్ని దాచారు.ఈ ప్లేన్ శనివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కస్టమ్స్ చట్టం కింద అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు దీన్ని ఇలా దాచారన్నది తెలియలేదు.ఒక విమానంలో ని సీటు కిందా పుత్తడి దాచిన ఘటన ఇదే మొదటిదని అంటున్నారు.ఢిల్లీ కస్టమ్స్ అధికారులు దీనిపై దుబాయ్ విమాన సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇటీవలి కాలంలో దుబాయ్ నుంచి భారత్ లోకి బంగారం దొంగ రవాణా ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు కస్టమ్స్ అధికారుల నిఘా కారణంగా ఈ స్మగ్లింగ్ కి అడ్డుకట్ట వేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ