దుబాయ్-ఢిల్లీ ఇండిగో విమానంలో సీటు కింద బంగారం పట్టివేత

- December 19, 2020 , by Maagulf
దుబాయ్-ఢిల్లీ ఇండిగో విమానంలో సీటు కింద బంగారం పట్టివేత

న్యూ ఢిల్లీ:దుబాయ్ నుంచి ఢిల్లీకి చేరిన ఇండిగో విమానంలో ఓ సీటు కింద దాచిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సకనుగొన్నారు. రూ.49.9 లక్షల విలువైన 1.13 కేజీల ఈ బంగారం సిలిండ్రికల్ రాడ్స్ రూపంలో ఉంది. విమానంలోని సీటు ట్రాక్ గార్డ్స్ లో ఎవరికీ కనబడకుండా నేర్పుగా దీన్ని దాచారు.ఈ ప్లేన్ శనివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కస్టమ్స్ చట్టం కింద అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు దీన్ని ఇలా దాచారన్నది తెలియలేదు.ఒక విమానంలో ని సీటు కిందా పుత్తడి దాచిన ఘటన ఇదే మొదటిదని అంటున్నారు.ఢిల్లీ కస్టమ్స్ అధికారులు దీనిపై దుబాయ్ విమాన సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇటీవలి కాలంలో దుబాయ్ నుంచి భారత్ లోకి  బంగారం దొంగ రవాణా ఘటనలు పెరిగిపోతున్నాయి.  అయితే ఎప్పటికప్పుడు కస్టమ్స్ అధికారుల నిఘా కారణంగా ఈ స్మగ్లింగ్ కి అడ్డుకట్ట వేయగలుగుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com