70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చే ప్రణాళిక

- December 31, 2020 , by Maagulf
70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చే ప్రణాళిక

దుబాయ్: 2021లో దుబాయ్‌లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చేలా ప్రణాళికలు రచించారు. ఫైజర్‌ మరియు బయో ఎన్‌టెక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ని ఉచితంగానే అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ముందస్తుగా 60 ఏళ్ళ పైబడినవారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. 2021 ముగిసేనాటికి 70 శాతం మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందిస్తామని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఏప్రిల్‌లో రెండో ఫేజ్‌ వ్యాక్సినేషన్‌ పౌరులందరికీ అలాగే నివాసితులందరికీ అందుతుందని దుబాయ్‌ స్టీరింగ్‌ కమిటీ - కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ ఛైర్‌ విమెన్‌ ఫరీదా అల్‌ ఖాజా చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com