సింగరేణి కార్మికుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- January 04, 2021హైదరాబాద్:సింగరేణి కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుండి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థ అభివృద్ధితోపాటు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు పలు వినతులను ప్రస్తావించగా, సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆరెపల్లి రాజేందర్, రాజేశ్వర్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన