కోవిడ్ వ్యాక్సిన్ ఆమోదం దేశానికే గర్వకారణం:టి.గవర్నర్
- January 04, 2021
హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలపడం దేశం గర్వించదగ్గ విషయమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. చెన్నైకి చెందిన శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల 7 రోజులపాటు నిర్వహించనున్న పాథాలజీ వార్షిక ర్యాపిడ్ రిప్యూ కోర్సు (ఎస్పీఏఆర్ఆర్సీ-2021)ను సోమవారం ఆమె వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధిలో భారత్ చొరవను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని గుర్తు చేశారు.

వ్యాక్సిన్ను WHO ఆమోదించడం మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న చాలాదేశాలు భారత్ తయారు చేసిన టీకా కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు.

భారత పరిశోధనపై విమర్శలకు టీకా అభివృద్ధితో మన శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారని అన్నారు. ప్రధాని మోడీ దూరదృష్టితో పరిశోధన సంస్థలకు ఆర్థిక ఊతం ఇచ్చి శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపడంతోనే వ్యాక్సిన్ తయారీ సాధ్యమైందని గవర్నర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









