కాజ్వే ద్వారా బహ్రెయిన్లోకి వచ్చేవారికి కొత్త గైడ్లైన్స్
- January 04, 2021
మనామా:కింగ్ ఫవాద్ కాజ్వే అథారిటీ, కొత్త హెల్త్ గైడ్లైన్స్ని బ్రహెయిన్ పౌరులు అలాగే, అనుమతి పొందిన ప్రయాణీకులు కింగ్డమ్లోకి ప్రవేశించేందుకోసం విడుదల చేయడం జరిగింది. ప్రయాణీకులు తమతోపాటు పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ని తీసుకురావాల్సి వుంటుంది. 72 గంటల ముందుగా చేసిన టెస్టుని మాత్రమే అనుమతిస్తారు. బహ్రెయిన్ అలాగే సౌదీ అరేబియా అ్రకెడెటెడ్ ల్యాబోరేటరీ నుంచి పొందిన సర్టిఫికెట్ని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అధికారిక ప్రభుత్వ మిషన్, పారిన్ మినిస్ట్రీ వ్యక్తులు, అఫీషియల్ మిషన్స్ వారి కుటుంబ సభ్యులు వంటి వారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నారు. క్లనికల్ ట్రయల్స్ పార్టిసిపెంట్లు, ఆరేళ్ళ లోపు చిన్నారులకు కూడా వెసులుబాట్లు కల్పించనున్నారు. బివేర్ బహ్రెయిన్ యాప్ ద్వారా పొందిన పరీక్ష ఫలితం, సౌదీ అరేబియాకి చెందిన యాప్ ద్వారా వచ్చే ఫలితం కూడా అనుమతిస్తారు. ముందస్తు పరీక్ష చేసుకోనివారికి మాత్రం కింగ్ ఫవాద్ కాజ్వే వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెస్ట్ సెంటర్స్లో పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుంది. పది రోజుల్లోగా వారు తిరిగి వెళ్ళకపోతే, పదవ రోజున మళ్ళీ పరీక్ష చేయించుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని, ప్రికాషన్స్ని పాటించక తప్పదు. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి తప్పనిసరి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







