టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి

- February 22, 2016 , by Maagulf
టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి

టీడీపీలో చేరితే అభివృద్ధి జరుగుతుందనే వైసీపీని వీడామని భూమా నాగిరెడ్డి అన్నారు. కొద్ది సేపటి క్రితం వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భూమా..టీడీపీలోకి రావటం సంతోషంగా ఉంది..సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాము..వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంతమంది వస్తారన్నది కాలమే నిర్ణయిస్తుందని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com