ఏపీలో కరోనా కేసుల వివరాలు
- January 10, 2021
అమరావతి:ఏ.పీలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 227 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,84,916 కి చేరింది. ఇందులో 8,75,243 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,544 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,129 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 289 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్, ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









