యూఏఈ ఎన్నారైలకు ఇక్కడి భారత కాన్సులేట్‌ ముఖ్యమైన సూచన

- February 23, 2016 , by Maagulf
యూఏఈ ఎన్నారైలకు ఇక్కడి భారత కాన్సులేట్‌ ముఖ్యమైన సూచన

పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (పీఐవో) కార్డుపై భారతకు వెళ్లాలనుకునే యూఏఈ ఎన్నారైలకు ఇక్కడి భారత కాన్సులేట్‌ ఓ ముఖ్యమైన సూచన చేసింది. మార్చి 31 తర్వాత ఈ కార్డులు చెల్లుబాటు కావని, ఆలోగా ఓసీఐ (ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా) కార్డుకు బదిలీ చేసుకోవాలని తెలిపింది. ఆఖరి నిముషంలో హడావుడి పడకుండా ప్రవాసీయులు ముందుగా వచ్చి కాన్సులేట్‌ కార్యాలయంలో బదిలీ దరఖాస్తు చేసుకోవాలని కాన్సుల్‌ (వీసా) రాహుల్‌ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా భారత నుంచి ఓసీఐ కార్డు రావడానికి రెండు నెలలు పడుతుందని, కానీ తాము నెల రోజుల్లోనే కార్డు తెప్పించి ప్రవాసులకు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మార్చి 31లోగా ఓసీఐ కార్డు పొందకపోతే భారతకు వెళ్లడం కోసం వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. అంతేకాదు... 1,020 దిర్హాంల దరఖాస్తు రుసుం చెల్లించి ఓసీఐ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com