యూఏఈ ఎన్నారైలకు ఇక్కడి భారత కాన్సులేట్ ముఖ్యమైన సూచన
- February 23, 2016
పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐవో) కార్డుపై భారతకు వెళ్లాలనుకునే యూఏఈ ఎన్నారైలకు ఇక్కడి భారత కాన్సులేట్ ఓ ముఖ్యమైన సూచన చేసింది. మార్చి 31 తర్వాత ఈ కార్డులు చెల్లుబాటు కావని, ఆలోగా ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డుకు బదిలీ చేసుకోవాలని తెలిపింది. ఆఖరి నిముషంలో హడావుడి పడకుండా ప్రవాసీయులు ముందుగా వచ్చి కాన్సులేట్ కార్యాలయంలో బదిలీ దరఖాస్తు చేసుకోవాలని కాన్సుల్ (వీసా) రాహుల్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా భారత నుంచి ఓసీఐ కార్డు రావడానికి రెండు నెలలు పడుతుందని, కానీ తాము నెల రోజుల్లోనే కార్డు తెప్పించి ప్రవాసులకు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మార్చి 31లోగా ఓసీఐ కార్డు పొందకపోతే భారతకు వెళ్లడం కోసం వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. అంతేకాదు... 1,020 దిర్హాంల దరఖాస్తు రుసుం చెల్లించి ఓసీఐ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







