టెర్రర్ 26న

- February 23, 2016 , by Maagulf
టెర్రర్ 26న

అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై సతీష్‌కాశెట్టి దర్శకత్వంలో శ్రీకాంత్, నిఖిత జంటగా షేక్ మస్తాన్ రూపొందించిన చిత్రం 'టెర్రర్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను శనివారం ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ముందుగా నరేష్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ చిత్రం గురించే తాము మాట్లాడుకున్నామని, తప్పక విజయవంతవౌతుందని తెలిపారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ నేరేషన్ విధానం నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని దర్శకుడు సతీష్ సినిమాను క్లీన్‌గా నీట్‌గా వండర్‌ఫుల్‌గా దర్శకత్వం వహించారని, సాయికార్తీక రీరికార్డింగ్ చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని కథానాయకుడు శ్రీకాంత్ అన్నారు.కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి దర్శకుడు ఎంత కష్టపడ్డాడో శ్రీకాంత్‌తో సహా మిగతా టెక్నీషియన్లు అందరూ అంతగా సపోర్ట్ చేశారని, అందుకే ఇంత బాగా చిత్రం వచ్చిందని నిర్మాత షేక్‌మస్తాన్ తెలిపారు. సినిమా తీయడం సులభమే అయినా విడుదల చేయడం సులభం కాదని ఈ చిత్రంతో తెలిసిందని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని వారు కోరుకుంటున్నట్లుగా దర్శకుడు సతీష్ కాశెట్టి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com