టెర్రర్ 26న
- February 23, 2016
అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై సతీష్కాశెట్టి దర్శకత్వంలో శ్రీకాంత్, నిఖిత జంటగా షేక్ మస్తాన్ రూపొందించిన చిత్రం 'టెర్రర్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ను శనివారం ప్రసాద్ ల్యాబ్లో విడుదల చేశారు. ముందుగా నరేష్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ చిత్రం గురించే తాము మాట్లాడుకున్నామని, తప్పక విజయవంతవౌతుందని తెలిపారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ నేరేషన్ విధానం నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని దర్శకుడు సతీష్ సినిమాను క్లీన్గా నీట్గా వండర్ఫుల్గా దర్శకత్వం వహించారని, సాయికార్తీక రీరికార్డింగ్ చిత్రానికి హైలెట్గా ఉంటుందని కథానాయకుడు శ్రీకాంత్ అన్నారు.కమర్షియల్గా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి దర్శకుడు ఎంత కష్టపడ్డాడో శ్రీకాంత్తో సహా మిగతా టెక్నీషియన్లు అందరూ అంతగా సపోర్ట్ చేశారని, అందుకే ఇంత బాగా చిత్రం వచ్చిందని నిర్మాత షేక్మస్తాన్ తెలిపారు. సినిమా తీయడం సులభమే అయినా విడుదల చేయడం సులభం కాదని ఈ చిత్రంతో తెలిసిందని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని వారు కోరుకుంటున్నట్లుగా దర్శకుడు సతీష్ కాశెట్టి అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







